రిజర్వ్ డే ఆట.. కెప్టెన్ కోహ్లీ ఔట్
ABN , First Publish Date - 2021-06-23T21:11:34+05:30 IST
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో రిజర్వ్ డే ఆట మొదలైంది. రెండు వికెట్లకు 64 పరుగులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో రిజర్వ్ డే ఆట మొదలైంది. రెండు వికెట్లకు 64 పరుగులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. జట్టు స్కోర్ 71 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ(13) పెవిలియన్ చేరాడు. జామిసన్ బౌలింగ్లో వాట్లింగ్కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 39 పరుగుల లీడ్లో ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా, రహానే ఉన్నారు. ఐదో రోజు ఆటలో ఓపెనర్లు రోహిత్ (30), గిల్ (8) వికెట్లను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. సౌథీ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరారు.