Chennai: మద్యం కలిపిన ఐస్‌క్రీమ్స్‌ విక్రయించిన దుకాణం సీజ్‌

ABN , First Publish Date - 2021-10-22T13:09:29+05:30 IST

కోయం బత్తూరు పీఎన్‌ పాళయం ప్రాంతంలో మద్యం కలిపిన ఐస్‌క్రీములు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అక్కడి ఐస్‌క్రీమ్స్‌ దుకాణాన్ని ఆహార భద్రతా విభాగం అధికారులు సీజ్‌ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం

Chennai: మద్యం కలిపిన ఐస్‌క్రీమ్స్‌ విక్రయించిన దుకాణం సీజ్‌

చెన్నై(Tamilnadu): కోయం బత్తూరు పీఎన్‌ పాళయం ప్రాంతంలో మద్యం కలిపిన ఐస్‌క్రీములు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అక్కడి ఐస్‌క్రీమ్స్‌ దుకాణాన్ని ఆహార భద్రతా విభాగం అధికారులు సీజ్‌ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం గురువారం ఉదయం ఓ ప్రకటన జారీ చేస్తూ కోయంబత్తూరు పీఎన్‌ పాళయం అవినాశి రోడ్డులో ‘రోలింగ్‌ టబ్‌ కేఫ్‌’ పేరుతో నడుపుతున్న ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో మద్యం కలిపిన ఐస్‌క్రీములు విక్రయిస్తున్నట్లు బుధవారం తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. తన ఆదేశం మేరకు స్థానిక ఆహార భద్రతావిభాగం అధికారులు తనిఖీ చేసినప్పుడు మద్యం కలిపిన ఐస్‌క్రీములు తయారు చేసి విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందని, అంతేకాకుండా ఆ దుకాణంలో నాసిరకమైన ఆహార పదార్థాలను కస్టమర్లకు పంపిణీ చేస్తున్నారని కనుగొని లైసెన్స్‌ రద్దు చేసి ఆ దుకాణాన్ని సీజ్‌ చేశారని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-10-22T13:09:29+05:30 IST