ఆదర్శ నేత సుందరయ్య
ABN , First Publish Date - 2020-05-20T11:38:49+05:30 IST
కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుంద రయ్య ఆదర్శనీయులని సీపీఎం మార్కాపురం ఏరియా కార్యదర్శి
మార్కాపురం (వన్టౌన్), మే 19: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుంద రయ్య ఆదర్శనీయులని సీపీఎం మార్కాపురం ఏరియా కార్యదర్శి డి. సోమ య్య పిలుపునిచ్చారు. సుందరయ్య వర్ధంతిని స్థానిక పార్టీ కార్యా లయంలో మంగళారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఒంగోలులోని పలు ప్రాంతాల్లో మంగళ వారం పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని సీపీఎం నాయకులు నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు వై.సిద్దయ్య ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు, పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు.జీవీ.కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, పెంట్యాల హనుమంతరావు, దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, కె.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తి: పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని మంగ ళవారం చీమకుర్తిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాలా అంజయ్య, పూసపాటి వెంకటరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.