జర్నలిస్టులను వారియర్లుగా గుర్తించండి

ABN , First Publish Date - 2021-05-11T09:46:46+05:30 IST

ఇతర రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వమూ జర్నలిస్టులను కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు.

జర్నలిస్టులను వారియర్లుగా గుర్తించండి

సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ 

హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వమూ జర్నలిస్టులను కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. జర్నలిస్టుకు ప్రత్యేకంగా బెడ్లను కేటాయించడంతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలని కోరారు. కొవిడ్‌తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా గుర్తించాయని గుర్తు చేశారు.

Updated Date - 2021-05-11T09:46:46+05:30 IST