కంగనా చట్టానికి అతీతురాలేమీ కాదు: బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్

ABN , First Publish Date - 2020-09-24T16:25:18+05:30 IST

నటి కంగనా రనౌత్ డ్రగ్ ఎడిక్ట్ అయివుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆమెను కూడా విచారించాలని మహారాష్ట్ర బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్ వ్యాఖ్యానించారు. ఆయన...

కంగనా చట్టానికి అతీతురాలేమీ కాదు: బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్

పూణె: నటి కంగనా రనౌత్ డ్రగ్ ఎడిక్ట్ అయివుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆమెను కూడా విచారించాలని మహారాష్ట్ర బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కంగనా చట్టానికి అతీతురాలేమీ కాదని, ఆమె మాదకద్రవ్యాలకు బానిసయివుంటే ఎన్సీబీ ఆమెను కూడా విచారించాలన్నారు. మన దేశంలోని చట్టానికి అందరూ సమానమేనన్నారు. కాగా డ్రగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న వారినందరినీ ప్రస్తుతం ఎన్సీబీ విచారిస్తోంది. ఈ కేసులో నటి రియా చక్రవర్తిని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. 


Updated Date - 2020-09-24T16:25:18+05:30 IST