IPL: సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-11T00:06:06+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనలో మరో నాలుగైదు

IPL: సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు

చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనలో మరో నాలుగైదు సంవత్సరాలు క్రికెట్ ఆడే సత్తా ఉందని పేర్కొన్న రైనా.. ధోనీ కనుక ఐపీఎల్ నుంచి రిటైరైతే తాను కూడా తప్పుకుంటానని పేర్కొన్నాడు. ‘‘నేనింకా నాలుగైదేళ్లు క్రికెట్ ఆడగలను. ఈ ఏడాది ఐపీఎల్ ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు ఐపీఎల్‌లో చేరబోతున్నాయి. నేను ఆడేంత వరకు చెన్నైకే ఆడతా. ఈ ఏడాది ఐపీఎల్‌లో మేం రాణిస్తామనే అనుకుంటున్నా’’ అని రైనా పేర్కొన్నాడు. 


‘‘ధోనీ భాయ్ కనక వచ్చే సీజన్ ఆడకుంటే, నేను కూడా ఆడను. ఇద్దరం కలిసి 2008 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్నాం. ఈ ఏడాది ఐపీఎల్ గెలిస్తే  వచ్చే ఏడాది కూడా ఆడాలని ధోనీని ఒప్పిస్తా. వీలైనంత వరకు అతడిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తా. అతడు కనక ఆడకుంటే, నేను కూడా ఐపీఎల్‌లో ఆడతానని అనుకోను’’ అని రైనా స్పష్టం చేశాడు. 

Updated Date - 2021-07-11T00:06:06+05:30 IST