ఇలాగైతే ఎలా..?

ABN , First Publish Date - 2021-05-17T04:20:57+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తోటి ప్రజలను పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.

ఇలాగైతే ఎలా..?
పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ వద్ద చేపల దుకాణాల వద్ద చేపల కోసం భౌతిక దూరం పాటించని జనం


ఆదివారం భౌతికదూరం గాలికి..

చోడవరం, మే 16: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తోటి ప్రజలను పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఆదివారం పట్టణంలోని చేపల దుకాణాలు, కెన్‌ దుకాణాల వద్ద పూర్తిగా భౌతికదూరం పాటించకుండా చేపలు మాసం కోసం ఎగబడి కొనడం విశేషం. చికెన్‌, మాంసం దుకాణాల వద్ద కొద్దిగా దూరం పాటించినా, చేపల దుకాణాల వద్ద మాత్రం భౌతికదూరాన్ని పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోవడం చూస్తుంటే, గ్రామీణప్రాంతంలో కేసులు ఇప్పట్లో అదుపులోనికి వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదనే చెప్పాలి. 

 

Updated Date - 2021-05-17T04:20:57+05:30 IST