‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’
ABN , First Publish Date - 2020-05-28T10:51:20+05:30 IST
రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తే అధికార పక్షానికి ఉలికిపాటు దేనికని కాంగ్రెస్ పార్టీ
ఖానాపూర్, మే 27: రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తే అధికార పక్షానికి ఉలికిపాటు దేనికని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు దొనికెని దయానంద్ ప్రశ్నించారు. బుదవారం ఖానాపూర్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. రేవంత్రెడ్డి వస్తే జిల్లాలో రైతుపై జరుగుతు న్న దోపిడీపై నిలదీస్తారని, ఆయన దాటిని మంత్రి తట్టుకోలేకనే కరోనా వైర్సను సాకుగా చూపి పోలీసులతో అనుమతి నిరాకరణ చేయించి పర్యటనను రద్దు చేయించారని ఆరోపించారు.