Yediyurappa : నాకు మెసేజ్ రాగానే మీకు పంపిస్తా

ABN , First Publish Date - 2021-07-25T18:36:32+05:30 IST

ముఖ్యమంత్రి యడియూరప్ప భవితవ్యం ఈ రోజు సాయంత్రంతో తేలిపోనుంది. ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించడమా?

Yediyurappa : నాకు మెసేజ్ రాగానే మీకు పంపిస్తా

బెంగళూరు : ముఖ్యమంత్రి యడియూరప్ప భవితవ్యం ఈ రోజు సాయంత్రంతో తేలిపోనుంది. ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించడమా? లేదా.. తొలిగించడమా? అన్న వ్యవహారంపై బీజేపీ అధిష్ఠానం ఓ క్లారిటీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యడియూరప్పే స్వయంగా వెల్లడించారు. ‘‘నా రాజకీయ భవితవ్యంపై నేటి సాయంత్రానికి అధిష్ఠానం ఓ క్లారిటీ ఇవ్వనుంది. ఈ మెసేజ్ రాగానే మీ అందరికి వెనువెంటనే తెలియజేస్తా’’ అని యడియూరప్ప పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రిందటే యడియూరప్ప ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోడానికి రెడీగా ఉన్నానని, అయితే తన షరతులను అంగీకరించాలని యడియూరప్ప కొన్ని షరతులను పెట్టారు. ఈ నెల 26 న కర్నాటకకు కొత్త ముఖ్యమంత్రి రానున్నారని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప ప్రకటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-07-25T18:36:32+05:30 IST