నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు.. నీతి, నిజాయితీ ఉంటే విచారణకు ముందుకు రా..

ABN , First Publish Date - 2021-08-06T16:57:59+05:30 IST

‘సోమిరెడ్డీ,.. నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు...

నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు.. నీతి, నిజాయితీ ఉంటే విచారణకు ముందుకు రా..

మాగుంటపై నేను కేసు పెడతానా..?

సోమిరెడ్డీ.. నీకు నీతి, నిజాయితీ ఉంటే విచారణకు ముందుకు రా..

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి సవాల్‌


నెల్లూరు: ‘సోమిరెడ్డీ,.. నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు... నీకు నీతి, నిజాయతీ ఉంటే నువ్వు చేసే ఆరోపణలపై విచారణకు ముందుకు రావాలి’ అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మా వాళ్లచేత తాను అక్రమంగా గ్రావెల్‌ తరలించానని, ఇటీవల ఆరోపణలు చేసిన సోమిరెడ్డి మావాళ్లపైనే నేనే కేసులు పెట్టించానని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎం శ్రీనివాసులురెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై కేసు పెట్టారంటూ సోమిరెడ్డి ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.


సోమిరెడ్డి లాంటి ఉడతలు పట్టే వెధవ... తలమాసిన వెధవ.. ప్రపంచంలో ఎవరూ ఉండరని ధ్వజమెత్తారు. నావాళ్ల చేతే దొంగ దరఖాస్తులు పెట్టించి అక్రమంగా గ్రావెల్‌ తరలించి మా వాళ్లమీదే మళ్ళీనేను కేసులు పెట్టించానని సోమిరెడ్డి ఆరోపణలు చేయడం చూస్తుంటే అతను ఎంత అడ్డాలా వెధవ అర్ధమవుతుందన్నారు. అతను చేసే ప్రతి ఆరోపణపై విచారణకు తాను సిద్దమని, అతనికి నీతి, నిజాయితీ ఉంటే విచారణకు ముందుకు రావాలని కాకాణి సవాల్‌ విసిరారు.

Updated Date - 2021-08-06T16:57:59+05:30 IST