శ్రీవారిపై నమ్మకం లేకపోతే తిరుమలను వీడాలి
ABN , First Publish Date - 2020-09-21T08:11:41+05:30 IST
తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సూచించారు.
టీటీడీ చైర్మన్ వైవీకి మాడభూషి లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సూచించారు. ఈ మేరకు ఆయన వైవీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు.
తిరుమల దర్శనానికి వచ్చే అన్య మతస్తులు ఎటువంటి డిక్లరేషన్/సంతకం పెట్టాల్సిన అవసరం లేదని వైవీ అనడం అసంబద్ధమే కాక అనవసరమని ఆయన పేర్కొన్నారు.