శ్రీవారిపై నమ్మకం లేకపోతే తిరుమలను వీడాలి

ABN , First Publish Date - 2020-09-21T08:11:41+05:30 IST

తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ సూచించారు.

శ్రీవారిపై నమ్మకం లేకపోతే తిరుమలను వీడాలి

టీటీడీ చైర్మన్‌ వైవీకి మాడభూషి లేఖ


హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ సూచించారు. ఈ మేరకు ఆయన వైవీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

తిరుమల దర్శనానికి వచ్చే అన్య మతస్తులు ఎటువంటి డిక్లరేషన్‌/సంతకం పెట్టాల్సిన అవసరం లేదని వైవీ అనడం అసంబద్ధమే కాక అనవసరమని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-21T08:11:41+05:30 IST