పెట్రోల్, డీజిల్ తరువాత పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ ధరలు!

ABN , First Publish Date - 2021-08-29T11:43:37+05:30 IST

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో బెంబేలెత్తిపోతున్న...

పెట్రోల్, డీజిల్ తరువాత పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ ధరలు!

న్యూఢిల్లీ: పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు ఈరోజు నుంచి గ్యాస్‌కు కూడా అదనంగా చెల్లించాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే ఇంద్రప్రస్థ్ గ్యాస్ లిమిటెడ్... కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ల ధరలను పెంచింది. ఇప్పటివరకూ ఢిల్లీలో పీఎన్జీ ధర కిలోకు రూ. 44.30గా ఉండగా, దీనిని 90 పైసల మేరకు పెంచారు. అదేవిధంగా పీఎన్జీ ధరను ప్రతీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్(ఎస్సీఎం)ను రూ.1.25 చొప్పున పెంచారు. దీంతో ప్రస్తుత ఢిల్లీలో సీఎన్జీ ప్రతీ కిలోకు 45.20గా ఉండగా, పీఎన్జీ ధర రూ. 29.61 పెరిగి, ప్రతీ ఎస్సీఎం రూ.30.86కు చేరింది. ఢిల్లీలో ఈ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి.



Updated Date - 2021-08-29T11:43:37+05:30 IST