రైతు, ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం దారుణం

ABN , First Publish Date - 2022-01-20T05:19:42+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం దారుణమని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డితో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

రైతు, ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం దారుణం
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి మధుబాబు

మదనపల్లె టౌన్‌, జనవరి 19:  వైసీపీ ప్రభుత్వం రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం దారుణమని తెలుగు రైతు రాష్ట్ర  కార్యదర్శి రాటకొండ మధుబాబు విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డితో కలసి  మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు పీఆర్సీ పెంచితే జగన్‌ హయాంలో కోత విధించారన్నారు. ఆర్బీకేలు పెట్టాం... అన్నీ అందుబాటులో ఉంటాయని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం గ్రామాల్లో ఆర్‌బీకేల పనితీరును పరిశీలించాలన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేవారు కరువయ్యారన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

Updated Date - 2022-01-20T05:19:42+05:30 IST