తీరంలో నిషేధాజ్ఞలు బేఖాతర్!
ABN , First Publish Date - 2021-06-14T05:44:22+05:30 IST
కొవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ జోడుగుళ్లపాలెం తీరంలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు.
జోడుగుళ్లపాలెం బీచ్కు వస్తున్న సందర్శకులు, జంటలు
పట్టించుకోని పోలీసులు
విశాలాక్షినగర్, జూన్ 13: కొవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ జోడుగుళ్లపాలెం తీరంలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా బీచ్లో నిషేధాజ్ఞలు ఉన్నాయి. అయినా సందర్శకులు పట్టించుకోకుండా తీరంలో షికారు చేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో తీరానికి వస్తుండగా.. మరికొందరు జంటలుగా వస్తూ ఆనందంగా గడుపుతున్నారు. జోడుగుళ్లపాలెం కూడలిలో పోలీస్ అవుట్ పోస్టు ఉన్నా బీచ్లోకి వెళ్లే జంటలను నియంత్రించకపోవడం గమనార్హం. ముఖ్యంగా జోడుగుళ్లపాలెం తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ నౌక వద్దకు సందర్శకులు వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీరంలోకి వచ్చేవారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.