రిమ్స్‌లో మెడికల్‌ విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-08-02T06:19:39+05:30 IST

రిమ్స్‌లో మెడికల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మెడికల్‌ కళాశాల మహిళా వసతి గృహంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

రిమ్స్‌లో మెడికల్‌ విద్యార్థులకు అస్వస్థత
చికిత్స పొందుతున్న మెడికల్‌ కళాశాల విద్యార్థులు

ఆదిలాబాద్‌, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): రిమ్స్‌లో మెడికల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మెడికల్‌ కళాశాల మహిళా వసతి గృహంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుకుంటున్న సల్మా, మనీష, రేష్మా, హరిప్రియలు అస్వస్థతకు గురై రిమ్స్‌లో చికిత్స తీసుకుం టున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. వరుసగా రిమ్స్‌ మెడికల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో హాస్టల్‌ నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రిమ్స్‌ డైరెక్టర్‌ వివరణ కోసం ప్రయత్నింగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2021-08-02T06:19:39+05:30 IST