వైద్యులపై దాడుల నివారణకు చట్టం తేవాలి: ఐఎంఏ

ABN , First Publish Date - 2021-06-19T09:11:44+05:30 IST

వైద్యులపై భౌతిక దాడులు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టం తీసుకుని రావాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌ కోరారు

వైద్యులపై దాడుల నివారణకు చట్టం తేవాలి: ఐఎంఏ

గుంటూరు(మెడికల్‌), జూన్‌ 18: వైద్యులపై భౌతిక దాడులు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టం తీసుకుని రావాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌ కోరారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా శుక్రవారం 1700 ఐఎంఏ శాఖల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో సమ్మెకు దిగకుండా రోగులను దృష్టిలో ఉంచుకొని నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టామని తెలిపారు. కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందిస్తూ దేశవ్యాప్తంగా 1500 మంది డాక్టర్లు మృతి చెందినట్లు చెప్పారు. ఇంత చేస్తున్నా కొందరు వైద్యచికిత్సల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ డాక్టర్లపై భౌతిక దాడులకు దిగడాన్ని ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-06-19T09:11:44+05:30 IST