వలస ఆదివాసీ హత్య

ABN , First Publish Date - 2020-08-05T11:53:30+05:30 IST

ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామ మైన చెరువుగుంపులో మడివి దూలయ్య(32) అనే వ లస ఆదివాసీ హత్యకు ..

వలస ఆదివాసీ హత్య

ఎటపాక, ఆగస్టు 4 : ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామ మైన చెరువుగుంపులో మడివి దూలయ్య(32) అనే వ లస ఆదివాసీ హత్యకు గురయ్యాడు. దూలయ్య సోమవారం ఉదయం తన పశువులను మేపేందుకు రోజూ మాదిరిగానే సమీపంలోని బండిరేవు అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. ఆ రోజు ఇంటికి రాక పోవ డంతో కుటుంబ సభ్యులు  బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీశారు. ఈక్రమంలో మంగళవారం దూలయ్య మృతదేహం బండిరేవు ఆటవీ ప్రాంతంలో  కన్పించింది.  దూలయ్య తలపై రాళ్లతో బలంగా కొట్టి చంపినట్లు ఆనవాళ్లు, గాయాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. భూ తగాదాల కారణంగానే దూలయ్యను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

Updated Date - 2020-08-05T11:53:30+05:30 IST