పుష్కరాలపై తుఫాన్ ప్రభావం
ABN , First Publish Date - 2020-11-28T09:44:16+05:30 IST
తుంగభద్ర పుష్కరాలపై తుఫాన్ ప్రభావం పడింది. పుష్కరాల ఎనిమిదోరోజైన శుక్రవారం భక్తులు చాలా తక్కువగా వచ్చారు.
కర్నూలు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర పుష్కరాలపై తుఫాన్ ప్రభావం పడింది. పుష్కరాల ఎనిమిదోరోజైన శుక్రవారం భక్తులు చాలా తక్కువగా వచ్చారు. సంకల్భాగ్ యాగశాలలో వర్షపునీరు చేరడంతో హోమాలకు, పూజలకు అంతరాయం కలిగింది. నగరేశ్వరస్వామి, షిరిడీసాయి, నాగసాయి, పంప్హౌస్, రాంబొట్ల పుష్కర ఘాట్లలో భక్తుల జాడేలేదు. మంత్రాలయంలోనూ రద్దీ తగ్గింది.