భక్తులకు ముద్రధారణ
ABN , First Publish Date - 2021-10-25T04:43:23+05:30 IST
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో పుణ్యక్షత్రం కిటికటలాడింది.
మంత్రాలయం, అక్టోబరు 24: మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో పుణ్యక్షత్రం కిటికటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు భక్తులకు ముద్రదారణచేసి ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. మఠం ప్రాంగాణం, నదీతీరం, ముఖద్వార్యం భక్తుల సందడితో కళకళలాడింది.