అంతా నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-05-08T04:48:43+05:30 IST

నెల్లూరురూరల్‌ ప్రాంతాల్లో కర్ఫ్యూను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మూడో రోజు శుక్రవారం నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై నాగార్జున్‌రెడ్డి తమ బృందాలతో పహారా కాశారు.

అంతా నిర్మానుష్యం
గుడిపల్లిపాడు కూడలి వద్ద పోలీసుల పహారా

నెల్లూరురూరల్‌, మే 7 :  నెల్లూరురూరల్‌ ప్రాంతాల్లో కర్ఫ్యూను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మూడో రోజు శుక్రవారం నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై నాగార్జున్‌రెడ్డి తమ బృందాలతో పహారా కాశారు. నెల్లూరు నుంచి బయటకు వెళ్లే ఇరగాలమ్మ కూడలి, కనుపర్తిపాడు క్రాసురోడ్డు, మైపాడుగేట్‌, నవాబుపేట వద్ద అల్లీపురం జంక్షన్‌, కొత్తూరు కూడలిలో తనిఖీలు నిర్వహించారు. అనుమతులున్న వారిని మాత్రమే వాహన రాకపోకలకు అంగీకరించిన పోలీసులు అనవసరంగా తిరిగి వారి వివరాలు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2021-05-08T04:48:43+05:30 IST