22 నుంచి తిరు కల్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2021-05-18T05:57:31+05:30 IST

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి తెలిపారు.

22 నుంచి తిరు కల్యాణోత్సవాలు

 ద్వారకాతిరుమల, మే 17: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి తెలిపారు.  కొవిడ్‌  నిబంధనలు  అనుసరించి ఏకాంత సేవలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 22న  స్వామి వారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించుట, 23న ధ్వజారోహణ, 24న గ్రామోత్సవం, 25న ఎదుర్కోలు ఉత్సవం, 26న  కల్యాణం, 27న రథోత్సవం, 28న ధ్వజ  అవరోహణ, 29న  కోవెల ప్రదక్షిణలతో ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా భాగంగా ఈ నెల 22 నుంచి 29 వరకు ఆర్జిత కల్యాణాలు, సేవలు ఉండవని, భక్తులు గమనించాలని కోరారు.


Updated Date - 2021-05-18T05:57:31+05:30 IST