బంగారు షాప్లో మాయలేడిలు కలకలం
ABN , First Publish Date - 2021-09-17T23:07:03+05:30 IST
జగద్గిరిగుట్ట పియస్ పరిధి దేవేందర్ నగర్లో ఓ బంగారు షాప్లో మాయలేడిలు కలకలం సృస్టించారు. కిలాడీ లేడిలు....
జీడిమెట్ల: జగద్గిరిగుట్ట పియస్ పరిధి దేవేందర్ నగర్లో ఓ బంగారు షాప్లో మాయలేడిలు కలకలం సృస్టించారు. కిలాడీ లేడిలు షాప్ యజమాని సంతోష్ను మాటలో మభ్యపెట్టి కిలోన్నర పైన వెండి కాళ్ల పట్టీల దొంగలించారు. షాపు యజమాని సంతోష్కు మహిళలపై అనుమానం రావడంతో, సిసి ఫూటేజ్ చెక్ చేస్తుండటంతో గమనించిన మహిళలు పారిపోయారు. షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాటి విలువ సుమారు లక్ష ఇరవై అయిదు వేల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు.