పెళ్లి వేదికపైనే దంపతుల ఆటలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. పగలబడి నవ్వుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-01-07T00:15:02+05:30 IST

వివాహం ద్వారా అప్పుడే ఒక్కటైన నూతన వధూవరులు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేదికపైనే ఆటలాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధిం

పెళ్లి వేదికపైనే దంపతుల ఆటలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. పగలబడి నవ్వుతున్న నెటిజన్లు..

ఇంటర్నెట్ డెస్క్: వివాహం ద్వారా అప్పుడే ఒక్కటైన నూతన వధూవరులు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేదికపైనే ఆటలాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే బంధువులు, సన్నిహితుల సమక్షంలో వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి పూర్తైన వెంటనే.. ఆ దంపతులకు పురోహితుడు ఓ పోటీ పెట్టాడు. వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలో ఎవరు ముందు కూర్చుంటే.. వాళ్లే భవిష్యత్తులో ఇంటిని నడుపుతారని వివరించాడు. ఆ తర్వాత కూర్చోండి అంటూ వధువరులకు చేతుల ద్వారా సైగ చేశాడు. 



అంతే.. క్షణంపాటులో ఇద్దరూ కుర్చీలపై కూర్చుండిపోయారు. అనంతరం నేను ఫస్ట్ కూర్చున్నానంటే.. కాదు నేనే ఫస్ట్ కూర్చున్నాను అంటూ వాదించుకున్నారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తిసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వధూవరులు వాదించుకోవడం చూసి.. నెటిజన్లు పగలబడి మరీ నవ్వుతున్నారు. కాగా.. వీడియో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం.. పురోహితుడు పెట్టిన పోటీలో వధువే గెలిచినట్టు తెలుస్తోంది. 






Updated Date - 2022-01-07T00:15:02+05:30 IST