యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలి

ABN , First Publish Date - 2021-11-30T06:46:48+05:30 IST

యాసంగిలో వరికి బదులుగా ఇతర పంట ల సాగు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సోమవారం ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.

యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, నవంబరు 29 : యాసంగిలో వరికి బదులుగా ఇతర పంట ల సాగు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సోమవారం ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసా ద్‌, తదితరులు పాల్గొన్నారు. ప్రజాఫిర్యాదులలో భాగంగా సోమవారం కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి కరీం అర్జీదారుల నుండి అర్జీలను స్వీక రించారు. ప్రజావాణిలో మొత్తం ఎనిమిది దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

సారంగాపూర్‌, నవంబరు 29 : మండల కేంద్రంలో గల మార్కెట్‌ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు స్వర్ణ, పోట్యాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ సోమవారం పరిశీలించారు. కొనుగోలు నిర్వాహ కులకు పలు సూచనలను ఇచ్చారు. ధాన్యం తేమ శాతంతో పాటు ధాన్యం ను జట్టడపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వేసంగిలో ధాన్యం కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు రైతులతో వివరించారు. రైతులు వరి పంటలను వేయ కుండా ఇతర పంటలను వేయాలని తెలిపారు. అలాగే తెలంగాణ మహా రాష్ట్ర సరిహద్దులో గల సిరిపెల్లి చెక్‌పోస్టు వద్దకు వెళ్లి మహారాష్ట్ర పరి శీలించి మహరాష్ట్ర నుండి వరి ధాన్యం తెలంగాణకు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈయ న వెంట అడిషనల్‌ కలెక్టర్‌ రాంబాబు, తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి, ఎంపీ డీవో సరోజ, వ్యవసాయ అధికారి రాజశేఖర్‌రెడ్డిలు ఉన్నారు. 

Updated Date - 2021-11-30T06:46:48+05:30 IST