భార‌త ఎంబ‌సీలో మే 21న ఆయూష్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెల్ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-05-17T01:52:04+05:30 IST

కువైట్‌లోని భార‌త ప్ర‌వాసుల‌ కోసం భార‌త రాయ‌బార కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా ఆయూష్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెల్ ప్రారంభిస్తున్నారు.

భార‌త ఎంబ‌సీలో మే 21న ఆయూష్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెల్ ప్రారంభోత్సవం

కువైట్ సిటీ: కువైట్‌లోని భార‌త ప్ర‌వాసుల‌ కోసం భార‌త రాయ‌బార కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా ఆయూష్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెల్ ప్రారంభిస్తున్నారు. ఈ నెల 21న(శుక్రవారం) ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయూష్ కార్య‌ద‌ర్శి వైద్య రాజేష్ ఆయూష్ స‌మాచార కేంద్రాన్ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్నారు. అలాగే ఇదే రోజున అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం-2021కి సంబంధించిన క‌ర్టైన్ రైజ‌ర్ కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించ‌నున్నారు. కువైట్‌లోని భార‌త ప్ర‌వాసులు, శ్రేయోభిలాషులు https://zoom.us/j/92794135807?pwd=Mm95b2ZpeGdsSDVnV3F6S0RmK1VwZz09 లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రాయ‌బార కార్యాల‌యం సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై కూడా ప్ర‌సారం చేయ‌నుంది. 

Updated Date - 2021-05-17T01:52:04+05:30 IST