ప్రోత్సాహాకాలను అందజేయాలి
ABN , First Publish Date - 2020-05-28T09:40:12+05:30 IST
గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లకు ప్రకటించిన ప్రోత్సాహాకాలను అందజేయాలని సీఐటీయూ నాయకులు
అశ్వారావుపేట, మే 27: గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లకు ప్రకటించిన ప్రోత్సాహాకాలను అందజేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పంచాయతీ సిబ్బందితో కలిసి ఎంపీడీవో రవికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడతూ కరోన సమయంలో సిబ్బందికి నెలకు రూ. 5వేలు అదనంగా ఇస్తామని ప్రకటించి రెండు నెలలు గడిచిందని, వెంటనే రెండు నెలల ప్రోత్సాహాకాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అర్జున్, ప్రభాకరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.