రేపటి నుంచి ముక్కంటి ఆలయ దర్శన వేళల పెంపు

ABN , First Publish Date - 2021-06-20T05:08:19+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శన వేళల్లో సోమవారం నుంచి మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.

రేపటి నుంచి ముక్కంటి ఆలయ దర్శన వేళల పెంపు

శ్రీకాళహస్తి, జూన్‌ 19: శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శన వేళల్లో సోమవారం నుంచి మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ మేరకు.. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముక్కంటి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమయంలో రాహు-కేతు పూజలనూ నిర్వహిస్తామన్నారు. అయితే కొవిడ్‌ నిబంధనల మేరకు స్వామి ఆర్జిత సేవలను ఏకాంతంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-20T05:08:19+05:30 IST