పేమెంట్ బ్యాంక్లో డిపాజిట్ పరిమితి రూ.2 లక్షలకు పెంపు
ABN , First Publish Date - 2021-04-09T05:48:07+05:30 IST
పేమెంట్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోగలిగే నగదు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది
ముంబై: పేమెంట్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోగలిగే నగదు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తెస్తూ గురువారం సర్క్యులర్ జారీ చేసింది. పేమెంట్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోగలిగే నగదు పరిమితిని రెట్టింపు చేయనున్నట్లు బుధవారం నాటి ద్రవ్యవిధాన పరపతి సమీక్షలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఎంఎ్సఎంఈలు, చిరు వ్యాపారులకు పేమెంట్ బ్యాంకుల సేవలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రస్తుతం దేశంలో అర డజను పేమెంట్ బ్యాంకులున్నాయి.