ఉత్తీర్ణతా శాతాన్ని పెంచండి
ABN , First Publish Date - 2021-02-24T05:37:22+05:30 IST
ఉపాధ్యాయులు పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచేలా కృషి చేయాలని ఉప విద్యా శాఖాధికారి బ్రహ్మజీరావు ఆదేశించారు.
సాలూరు/రూరల్, ఫిబ్రవరి 23: ఉపాధ్యాయులు పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచేలా కృషి చేయాలని ఉప విద్యా శాఖాధికారి బ్రహ్మజీరావు ఆదేశించారు. పట్టణంలో ఉన్న వేదసమాజం సంస్కృతోన్నత పాఠశాలను ఆయన మంగ ళవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచ టానికి ఏఏ చర్యలు తీసుకున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలు సుకున్నారు. ఇటీవల రాష్ట్ర శిక్షణా పరిశోధన సంస్థ విడుదల చేసిన ప్రశ్నపత్ర మార్పు, బ్లూప్రింట్ను అనుసరించాలని సూచించారు. శతశాతం ఫలితాలు రాబట్టేలా చర్యలు తీసుకో వాలని కోరారు. హెచ్ఎం ప్రభాకర్రావు, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు. అనంతరం శివరాంపురం పాఠశాలను సందర్శించారు.