ముక్కంటి ఆలయంలో ప్రఽసాదాల ధర పెంపు
ABN , First Publish Date - 2020-12-05T06:57:54+05:30 IST
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రసాదాల ధర పెంచారు.
శ్రీకాళహస్తి, డిసెంబరు 4: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రసాదాల ధర పెంచారు. ఈ ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. చిన్న లడ్డూ (80గ్రాములు) రూ.10నుంచి రూ.15కు... కల్యాణ లడ్డూ (400 గ్రాములు) రూ.50 నుంచి రూ.100కు...వడ రూ.10 నుంచి రూ.15కు... పులి హోర రూ.10 నుంచి రూ.15కు... జిలేబీ రూ.15 నుంచి రూ.20కు పెంచారు.