పెరిగిన కరోనా కేసులు...కొత్తగా 163 నమోదు

ABN , First Publish Date - 2021-07-30T05:20:15+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

పెరిగిన కరోనా కేసులు...కొత్తగా 163 నమోదు

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 163 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,775కు చేరింది. ఇందులో  1,49,953 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో   మరణాల సంఖ్య 1050కి చేరింది. 


మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు..: జిల్లాలో మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 362కు చేరింది. ఇందులో 255 మంది కోలుకున్నారు. మరో 32 మంది చనిపోయారు. 

Updated Date - 2021-07-30T05:20:15+05:30 IST