ఏపీలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-28T23:41:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి విద్యాసంస్థల్లో

ఏపీలో పెరిగిన కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి విద్యాసంస్థల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కరోనాతో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,205కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 5,394 యాక్టివ్ కేసులున్నాయి.


రాష్ట్రంలో  కొవిడ్‌ మహమ్మారి కమ్ముకొస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారా కాంటాక్ట్స్‌ పెరిగి పాజిటివ్‌లు ఎక్కువైపోతున్నాయి. దీంతో జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతోంది. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం నుంచి రోడ్లపైకి వచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌లు లేనివారికి జరిమానాలు విధించడం ప్రారంభించారు. మొదటిసారి పట్టుబడితే రూ.250, రెండోసారి రూ.500 తప్పదని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-03-28T23:41:36+05:30 IST