ఢిల్లీ తెలంగాణ భవన్ లో స్వాతంత్ర్య వేడుకలు
ABN , First Publish Date - 2021-08-15T21:18:02+05:30 IST
భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎం సాహ్ని జాతీయ జెండా ను ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ: భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎం సాహ్ని జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం ప్రాంగణం లో మొక్కలు నాటి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్, జాతీయ నీటి మిషన్ సంచాలకులు, భవన్ అధికారులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.