నేడు స్వాతంత్య్ర వేడుకలు
ABN , First Publish Date - 2020-08-15T09:54:52+05:30 IST
నగరంలోని పరేడ్ గ్రౌండ్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతా
కర్నూలు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నగరంలోని పరేడ్ గ్రౌండ్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జెండా ఎగురవేస్తారు. ఆ తర్వాత సాయుధ దళాలను పరిశీలిస్తారు. స్యాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని మంత్రి వినిపిస్తారు.
అనంతరం సాయుధ దళాల మార్చి ఫాస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల అభినందన కార్యక్రమం ఉంటాయి. ప్రభుత్వ శాఖల అభివృద్ధిపై శకటాల ప్రదర్శన, బాలల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ స్టాల్స్ ప్రదర్శన ఉంటాయి. కార్యక్రమానికి అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హాజరు అవుతారు.