విజయవాడ: అటు వేడుకలు..ఇటు బురద
ABN , First Publish Date - 2020-08-14T19:59:17+05:30 IST
స్వాతంత్ర్య వేడుకలకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.
విజయవాడ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. అయితే వర్షాల కారణంగా స్టేడియం అంతా బురదమయం అయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారిపోయింది. దీంతో శనివారం జరగబోయే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శకటాలు తిరిగేందుకు ప్రత్యేక మార్గాలు వేశారు. ఏర్పాట్లను డీజీపీ సవాంగ్ పరిశీలించారు.