రేపు ఆ మార్గంలో కమర్షియల్ వాహనాలకు నో ఎంట్రీ!
ABN , First Publish Date - 2021-08-14T15:30:16+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అనుక్షణం అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీలో వాహనాల ఎంటీపై పలు నిబంధనలు విధించారు. ఆగస్టు 14 రాత్రి 11 గంటలు మొదలుకొని నోయిడా నుంచి ఢిల్లీకి కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పంద్రాగస్టు వేడుకలు ముగిసేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ను ఇతర మార్గాలవైపు మళ్లించనున్నారు.