వెలుతురులేమి కారణంగా ముందే ఆగిన తొలి రోజు ఆట

ABN , First Publish Date - 2021-11-25T22:18:52+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట నిర్ణీత సమయానికి ముందే ఆగింది. ఆట ముగిసే సమయానికి

వెలుతురులేమి కారణంగా ముందే ఆగిన తొలి రోజు ఆట

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట నిర్ణీత సమయానికి ముందే ఆగింది. ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (75), రవీంద్ర జడేజా (50) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని క్రీజులో ఉన్నారు. టెస్టుల్లో జడేజాకు ఇది 17వ అర్ధ సెంచరీ కాగా, తొలి టెస్టు ఆడుతున్న శ్రేయాస్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించి సెంచరీ దిశగా సాగుతున్నాడు.


ఇద్దరూ కలిసి 208 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చారు.


అంతకుముందు మయాంక్ అగర్వాల్ 13, శుభమన్ గిల్ 52, పుజారా 26, రహానే 35 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు వికెట్లు పడగొట్టగా, టిమ్ సౌథీకి ఒక వికెట్ దక్కింది. వెలుతురు మందగించి ఆటకు అనుకూలంగా లేకపోవడంతో ఆరు ఓవర్ల ముందే మ్యాచ్‌ను ముగించారు.  

Updated Date - 2021-11-25T22:18:52+05:30 IST