కొవిడ్ చికిత్సకు రోచి ఇండియా ఔషధం
ABN , First Publish Date - 2021-05-06T07:21:47+05:30 IST
కొవిడ్ చికిత్సకు రోచి ఇండియా తయారు చేసిన యాంటీబాడీ ఔషఽధ మిశ్రమానికి కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు...
- అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన సీడీఎస్సీవో
- కొవిడ్ చికిత్సకు రోచి ఇండియా ఔషధం
న్యూఢిల్లీ, మే 5: కొవిడ్ చికిత్సకు రోచి ఇండియా తయారు చేసిన యాంటీబాడీ ఔషఽధ మిశ్రమానికి కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రోచి ఇండియా బుధవారం వెల్లడించింది. కాసిరివిమాబ్, ఇండెవిమాబ్ అనే రెండు ఔషధాలను తగు మోతాదులో కలిసి ఈ ఔషధ మిశ్రమాన్ని ఈ సంస్థ తయారుచేసింది. ఈ ఔషధ మిశ్రమాన్ని స్వల్ప, మోస్తరు వైరస్ లోడ్ ఉన్న పెద్దలకు, కనీసం 40 కేజీల బరువున్న 12 ఏళ్లు నిండిన పిల్లలకు వినియోగించవచ్చని పేర్కొంది. వీళ్లకు ఈ మందు వాడడం వల్ల తీవ్రత తగ్గుతుందని, దీంతో.. ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితులను నిరోధించ వచ్చని తెలిపింది. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవాళ్లలోనూ తీవ్రతను తగ్గిస్తుందని రోచి ఇండియా తెలిపింది.