ఐసీసీ 2021 మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన

ABN , First Publish Date - 2022-01-25T00:40:16+05:30 IST

టీమిండియా మహిళా జట్టు ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి

ఐసీసీ 2021 మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన

న్యూఢిల్లీ: టీమిండియా మహిళా జట్టు ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్‌గా ఎంపికైన స్మృతి రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జట్టు 8 మ్యాచుల్లో రెండింటిలోనే విజయం సాధించింది.


ఈ రెండు మ్యాచుల్లోనూ మంధాన కీలక పాత్ర పోషించి జట్టుకు విజయాన్ని అందించింది. రెండో వన్డేలో 158 పరుగుల లక్ష్య ఛేదనలో 80 (నాటౌట్) పరుగులు చేయగా, చివరి టీ20లో అజేయంగా 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అలాగే, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సిరీసుల్లోనూ రాణించింది. తొలి పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసి టెస్టుల్లో తొలి శతకాన్ని నమోదు చేసింది.  

Updated Date - 2022-01-25T00:40:16+05:30 IST