Olympics: కాంస్య పతక విజయంతో భారత జట్టు మరో రికార్డ్!

ABN , First Publish Date - 2021-08-05T17:36:32+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంస్య పతకాన్ని ముద్దాడింది టీమిండియా.

Olympics: కాంస్య పతక విజయంతో భారత జట్టు మరో రికార్డ్!

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంస్య పతకాన్ని ముద్దాడింది టీమిండియా. దీంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ విజయంతో భారత హాకీ జట్టు మరో రికార్డు సృష్టించింది. పురుషుల హాకీలో అత్యధిక పతకాలు గెలిచిన జట్టుగా నిలిచింది. భారత్ ఇప్పటివరకు మొత్తం 12 పతకాలు(8 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు) గెలిచింది. ఇంతకుముందు జర్మనీ 11 పతకాలతో(4 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు) భారత్ కంటే ముందుంది. కానీ, గురువారం జర్మనీనే ఓడించిన భారత జట్టు.. పతకాల పరంగాను ఆ దేశాన్ని వెనక్కి నెట్టింది. కాగా, 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణం గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పతకం కూడా గెలవలేదు. ఈ కాంస్య పతకం విజయంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర పడినట్లైంది.    

Updated Date - 2021-08-05T17:36:32+05:30 IST