15న భారత్‌-ఈయూ శిఖరాగ్ర సమావేశం

ABN , First Publish Date - 2020-07-10T07:55:14+05:30 IST

భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)ల శిఖరాగ్ర సమావేశం ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా నిర్వహించబోతున్నారు. దీనిలో యూరోపియన్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్...

15న భారత్‌-ఈయూ శిఖరాగ్ర సమావేశం

న్యూఢిల్లీ, జూలై 9: భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)ల శిఖరాగ్ర సమావేశం ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా నిర్వహించబోతున్నారు. దీనిలో యూరోపియన్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌లతో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చిస్తారని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టం అమలులో విలువలు వంటి వాటి ఆధారంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ఈ సమావేశం ఉంటుందన్నారు.  


Updated Date - 2020-07-10T07:55:14+05:30 IST