అదంతా అబద్దం ఆ టోర్నీలో పాల్గొనడం లేదు: ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2020-08-04T21:28:36+05:30 IST

శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడంపై భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. దీనికి సంబంధించి వస్తున్న వార్తలను ట్విటర్ వేదికగా

అదంతా అబద్దం ఆ టోర్నీలో పాల్గొనడం లేదు: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడంపై భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. దీనికి సంబంధించి వస్తున్న వార్తలను ట్విటర్ వేదికగా ఖండించాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 టోర్నీలు జరుగుతున్నాయి. వాటిలో నేనూ ఆడాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికైతే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ టోర్నీలోనూ పాల్గొనేందుకు సిద్థంగాలేను. అయితే త్వరలో ప్రారంభం కానున్న శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో నేను పాల్గొనబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అదంతా తప్పుడు సమాచారమ’ని పఠాన్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే శ్రీలంక టీ20 టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనబోతున్న 70 మంది క్రికెటర్లలో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నాడంటూ ఓ వార్త సంస్థ పేర్కొంది.

Updated Date - 2020-08-04T21:28:36+05:30 IST