రెండు రోజుల్లో ఒలింపిక్స్ పూర్తి.. భారత్ ఎక్కడుందంటే..

ABN , First Publish Date - 2021-08-07T04:52:19+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటివరకు 89 దేశాలు లేదా నేషనల్ ఒలింపిక్ కమిటీలు..

రెండు రోజుల్లో ఒలింపిక్స్ పూర్తి.. భారత్ ఎక్కడుందంటే..

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటివరకు 89 దేశాలు లేదా నేషనల్ ఒలింపిక్ కమిటీలు పతకాలు గెలుచుకున్నాయి. అందులోనూ 293 బంగారు పతకాలను ఆయా దేశాలు/ఎన్‌ఓసీలు గెలుచుకున్నాయి. ఇక పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పతకాల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 36 బంగారు, 26 రజత, 17 కాంస్యాలతో మొత్తం 79 పతకాలతో టాప్‌లో ఉంది. రెండో స్థానంలో 31 గోల్డ్, 36 సిల్వర్, 31 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 98 మెడల్స్‌తో అమెరికా నిలిచింది. ఇక జపాన్ 24 గోల్డ్స్, 11 సిల్వర్స్, 16 బ్రాజ్ మెడల్స్‌తో మొత్తం 51 మెడల్స్ కొట్టి పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 


ఇదిలా ఉంటే భారత్ ఈ పట్టికలో 66వ స్థానంలో ఉంది. 2 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు మాత్రమే సాధించిన భారత్ ఒక్క బంగారు పతకాన్ని కూడా తీసుకురాలేకపోయింది. 



Updated Date - 2021-08-07T04:52:19+05:30 IST