2 వికెట్లను కోల్పోయిన భారత్..స్కోర్104/2

ABN , First Publish Date - 2020-12-02T16:06:34+05:30 IST

ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌...

2 వికెట్లను కోల్పోయిన భారత్..స్కోర్104/2

ఓవల్: ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (16) ఔటయ్యాడు. అగర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్ పెవిలియన్‌కు దారిపట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ (33) కూడా అగర్ బౌలింగ్‎లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో భారత్ 82 పరుగులకే  రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36) రన్స్, అయ్యర్ (14) పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుత్తం భారత్ 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లను కోల్పోయి 104  పరుగులు చేసింది. కాగా తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌ తీసుకున్నాడు. ఇప్పటికే భారత్ టీమ్ 2-0తో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. చివరి వన్డే మ్యాచ్‎లో గెలిచి పరువు కాపాడుకోవాలనే కసితో ఉంది.

Updated Date - 2020-12-02T16:06:34+05:30 IST