ఇది హిందువుల దేశం : ఆరెస్సెస్ నేత

ABN , First Publish Date - 2021-10-20T02:44:19+05:30 IST

భారత దేశం హిందువుల దేశమని రాష్ట్రీయ

ఇది హిందువుల దేశం : ఆరెస్సెస్ నేత

బెంగళూరు : భారత దేశం హిందువుల దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఆనంద్ కులకర్ణి పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మైనారిటీలను బుజ్జగించేందుకే లౌకికవాద దేశమని రాజ్యాంగంలో చేర్చారని, దీని గురించి చట్ట సభ్యులకు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు తెలియదని అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


కాషాయ జెండాను కర్ణాటక విధాన సౌధ, పార్లమెంటు, ఎర్ర కోటలపై ఎగురవేయాలన్నారు. ఈ దేశం నుంచి ముస్లింలు, క్రైస్తవులను పంపించేస్తే, వారికి ఇతర దేశాలు ఉన్నాయని, హిందువులకు మాత్రం కేవలం ఒక దేశమే ఉందని చెప్పారు. ఇది హిందువుల దేశంగా మారాలన్నారు. రాజ్యాంగం నుంచి లౌకిక దేశం అనే పదాన్ని తొలగించాలన్నారు. ఇది లౌకికదేశం కాదని, హిందూ దేశమని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


Updated Date - 2021-10-20T02:44:19+05:30 IST