కరోనా పెరుగుతున్నా.. లాక్‌డౌన్ ఎత్తేస్తున్న ఏకైక దేశం: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-05-27T03:30:00+05:30 IST

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

కరోనా పెరుగుతున్నా.. లాక్‌డౌన్ ఎత్తేస్తున్న ఏకైక దేశం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. 21 రోజుల్లో కరోనాను జయిస్తామని మోదీ చెప్పారని, కానీ 60 రోజులవుతున్నా ఎటువంటి ముందడుగూ వేయలేదని రాహుల్ ఆరోపించారు. అలాగే ఇప్పుడు లాక్‌డౌన్ తొలగించడంపై కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ఓ పక్క కరోనా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ తొలగిస్తున్న ఏకైక దేశం భారతే’ అని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని జవాబు చెప్పాలని కోరారు. ‘ప్రధానిని అత్యంత వినయంగా ప్రశ్నిస్తున్నాం.. మోదీగారూ ప్లాన్ బీ ఏంటి?’ అని రాహుల్ ప్రశ్నించారు.

Updated Date - 2020-05-27T03:30:00+05:30 IST