అవుటైన రాహుల్, రిషభ్ పంత్.. నాలుగు వికెట్లు డౌన్

ABN , First Publish Date - 2022-01-21T22:15:09+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది

అవుటైన రాహుల్, రిషభ్ పంత్.. నాలుగు వికెట్లు డౌన్

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధ సెంచరీలతో అదరగొట్టి స్కోరు బోర్డును ఉరకలెత్తించిన కెప్టెన్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఒకరి తర్వాత ఒకరిగా పెవిలియన్ చేరారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ (55) మగల బౌలింగులో వాండెర్ డుసెన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఆ తర్వాత నాలుగు పరుగులకే సెంచరీ దిశగా పయనిస్తున్నట్టు కనిపించిన రిషభ్ పంత్ పెవిలియన్ చేరాడు.


71 బంతులు ఎదుర్కొన్న పంత్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిశాయి. ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 187  పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-01-21T22:15:09+05:30 IST