ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. వోక్స్‌కు దొరికిపోయిన జడేజా

ABN , First Publish Date - 2021-09-05T21:53:37+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. వోక్స్‌కు దొరికిపోయిన జడేజా

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 270/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 26 పరుగులు మాత్రమే జోడించి నాలుగో వికెట్ కోల్పోయింది. 59 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన రవీంద్ర జడేజా క్రిస్ వోక్స్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసి 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లీ (40), రహానే క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-09-05T21:53:37+05:30 IST