India vs Sri Lanka: మ్యాచ్ ప్రారంభమైన వెంటనే వికెట్ కోల్పోయిన భారత్
ABN , First Publish Date - 2021-07-24T00:18:12+05:30 IST
వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికే టీమిండియా మరో వికెట్ కోల్పోయింది.
కొలంబో: వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికే టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద మనీష్ పాండే అవుటయ్యాడు. 19 బంతుల్లో 11 పరుగులు చేసిన పాండే.. జయవిక్రమ బౌలింగులో భానుకకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 26 ఓవర్లు పూర్తయ్యాయి. భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సూర్యకుమార్ 31, హార్దిక్ పాండ్యా 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు.