మెరుపులు మెరిపించి ఔటైన్ పంత్.. ఊపిరి పీల్చుకున్న పాక్

ABN , First Publish Date - 2021-10-25T02:12:07+05:30 IST

క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అవుటయ్యాడు

మెరుపులు మెరిపించి ఔటైన్ పంత్.. ఊపిరి పీల్చుకున్న పాక్

దుబాయ్: క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అవుటయ్యాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి నిదానంగా ఆడిన రిషభ్.. క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు.


ఈ క్రమంలో షాదాబ్ ఖాన్ బౌలింగులో భారీ షాట్‌కు యత్నించిన పంత్.. అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. మరోవైపు, క్రీజులో కుదురుకున్న కోహ్లీ ఎలాంటి ఆవేశానికి గురికాకుండా నెమ్మదిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజాతో కలిసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు, పంత్ అవుట్ కావడంతో పాక్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-10-25T02:12:07+05:30 IST